హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబుకు షాక్: జగన్ పార్టీలోకి బోడ జనార్దన్

By Pratap
|
Google Oneindia TeluguNews

Boda Janardhan
హైదరాబాద్: తెలంగాణ ప్రాంతంలోని ఆదిలాబాద్ జిల్లాలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి షాక్ తగిలింది. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి, తెలుగుదేశం సీనియర్ నాయకుడు బోడ జనార్దన్ శనివారం వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. వైయస్ జగన్ సమక్షంలో ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. అదే జిల్లాకు చెందిన తెలంగాణ పోరాట యోధుడు కొమురం భీం మనవడు కొమురం సోసేరావు కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. ఇది తమ పార్టీకి శుభపరిణామమని పార్టీ నేత జనక్ ప్రసాద్ అన్నారు.

చంద్రబాబు ఆదిలాబాద్ జిల్లాల్లో పర్యటించి ఇటు హైదరాబాదు చేరుకున్నారో లేదో బోడ జనార్దన్ తెలుగుదేశం పార్టీకి సలాం కొట్టి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. నిజానికి బోడ జనార్దన్ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరుతారని భావించారు. కానీ ఎందుకో ఆయన మనసు మార్చుకుని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. బోడ జనార్దన్ నాలుగు సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. తెలంగాణలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆయన చెప్పారు. అయితే బోడ జనార్దన్‌ గతంలోనే తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండయ్యారు.

English summary
TDP senior leader from Adilabad district Boda Janardhan has joined in YS Jagan's YSR Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X