విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బొత్సకు మద్యం షాపులలో వాటాలు: దేవినేని ఉమ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Devineni Umamaheshwara Rao
విజయవాడ: ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు రాష్ట్రంలోని మద్యం షాపులలో వాటాలు ఉన్నాయని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు, జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వర రావు ఆదివారం ఆరోపించారు. దీనిపై వెంటనే సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గత రెండు రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న సిబిఐ సోదాల వివరాలు బయట పెట్టాలన్నారు. మద్యం సిండికేట్ల కుంభకోణంలో ప్రమేయమున్న మంత్రులను వెంటనే బర్తరఫ్ చేయాలన్నారు. ఎసిబి దాడుల్లో బయటపడుతున్న వాస్తవాలు చూస్తుంటే మంత్రులు, ప్రజాప్రతినిధులు అవినీతిలో ఎంతగా కూరుకుపోయారో అర్థమవుతోందన్నారు.

రాష్ట్రంలో మద్యం అమ్మకాలకు రోజుకు రూ.ఆరవై కోట్ల నుండి డెబ్బై కోట్ల వరకూ సాగుతున్నాయన్నారు. బొత్స కుటుంబ సభ్యులకు కూడా వాటా ఉందని ఆరోపించారు. కాగా రెండు రోజులుగా రాష్ట్రంలోని పలు మద్యం దుకాణాలపై ఎసిబి దాడులు చేస్తోంది. ఈ దాడులలో ఎసిబి కీలక పత్రాలు, హార్డ్ డిస్క్‌లు గుర్తించింది. సిండికేట్లు ఎవరెవరికి ఎంత లంచమిచ్చామని పొందుపర్చిన వివరాలు ఎసిబి గుర్తించింది.

English summary
TDP Krishna district MLA Devineni Umamaheshwara Rao accused that Minister Botsa Satyanarayana have shares in liquor shops.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X