వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భార్య కోసం టవరెక్కిన భర్త, ఇంజనీరింగ్ విద్యార్థి మృతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Vishakaptnam
విశాఖపట్నం: భార్యను అత్తింటి వారు తీసుకు వెళ్లారని ఓ భర్త టవర్ ఎక్కి నిరసన తెలిపిన సంఘటన ఆదివారం విశాఖపట్నం జిల్లా భీమిలిలో చోటు చేసుకుంది. భీమిలిలో ఉంటున్న ఓ యువకుడు ఓ అమ్మాయిని గత కొన్నాళ్లుగా ప్రేమించుకున్నారు. తల్లిదండ్రులు ఒప్పుకోక పోవడంతో వారు రెండు నెలల క్రితం పెళ్లి చేసుకొని వేరుగా ఉంటున్నారు. ఇటీవల అమ్మాయి తల్లిదండ్రులు వచ్చి ఆమెను తీసుకు పోయారు. దీంతో తన భార్యను తన వద్దకు పంపించి న్యాయం చేయాలని అతను టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. తన భార్యను తీసుకు వెళ్లినప్పుడే పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని ఆరోపించాడు. అయితే స్థానికులు, పోలీసులు కలుగజేసుకొని న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో టవర్ దిగి వచ్చాడు. సుమారు గంటపాటు అందరికి ముచ్చెమటలు పోయించాడు.

కాగా జిల్లాలోని అవంతి ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన ఓ విద్యార్థి అనుమానాస్పద పరిస్థితిలో సోమవారం మృతి చెందాడు. సీనియర్ విద్యార్థులతో విద్యార్థులతో కలిసి వెళ్లిన మృతుడు అనకాపల్లిలో శవమై తేలాడు. అయితే అతని మృతికి ర్యాగింకే కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మరోవైపు తుపాకులతో బెదిరించి దొంగతనాలకు పాల్పడుతున్న ఓ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ముగ్గురు ప్రధాన నిందితులతో పాటు మరికొందరిని పోలీసులు మీడియా ఎదుట ప్రవేశ పెట్టారు. పోలీసులు వారి నుండి రూ.5 లక్షల విలువైన ఆభరణాలు, రెండు నాటు తుపాకులు, పిస్టల్ స్వాధీనం చేసుకున్నారు. ఇదే ముఠాకు చెందిన మరికొందరి కోసం గాలిస్తున్నారు. వారిని పట్టుకున్న వారికి రివార్డ్ ప్రకటించారు.

English summary
A husband from Vishakapatnam was climb cell tower for his wife today. Her parents took her for love marriage.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X