లిక్కర్ సిండికేట్ల స్కామ్: సిఎం చేతికి నివేదిక, ఉత్కంఠ
రాష్ట్ర మంత్రులకు, ఎమ్మెల్యేలకు, కొందరు పాత్రికేయులకు సైతం అక్రమ మద్యం విక్రయాల కుంభకోణంలో మామూళ్లు కోట్లలో ముట్టినట్టు ఎసిబికి గట్టి ఆధారాలు లభించినట్లు చెబుతున్నారు. ఈ వివరాలనే భూపతిబాబు నేటి సమావేశంలో ముఖ్యమంత్రికి నివేదిక సమర్పించినట్టు తెలుస్త్తోంది. అంతకు ముందు - రాష్ట్రంలోని లిక్కర్ సిండికేట్స్పై తాము జరిపిన సోదాలపై అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) ఉన్నతాధికారులు సోమవారం సమీక్షించారు. ఎసిబి అదనపు డైరెక్టర్ జనరల్ భూపతిబాబు అధ్యక్షతన అదనపు డైరెక్టర్లు, జాయింట్ డైరెక్టర్లు సమావేశమై సోదాలపై సమీక్ష నిర్వహించారు. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు బొత్స సత్యనారాయణపై లిక్కర్ సిండికేట్ల విషయంలో తీవ్ర ఆరోపణలు వచ్చాయి. నాలుగు జిల్లాల్లో ఆయన హవా సాగుతోందని మీడియాలో వార్తాకథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సోదాల వివరాలను వెల్లడించాలని బొత్స సత్యనారాయణ ఎసిబికి సూచించారు.