వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఎపిపిఎస్సీలో గోల్మాలంటూ కెసిఆర్ కూతురు ఆందోళన
బాధిత విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. తెలుగు మీడియం విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. తెలుగు ప్రొఫెసర్లతో దిద్దించకుండా ఇంగ్లీష్ ప్రొఫెసర్లతో దిద్దించారని విమర్శించారు. కాగా ఆందోళన చేస్తున్న గ్రూప్-1 అభ్యర్థులు, కవితను ఎపిపిఎస్సీ కార్యదర్శి పూనమ్ మాలకొండయ్య చర్చలకు పిలిచారు. కాగా తెలంగాణ విద్యార్థుల పట్ల సిఎం కిరణ్ కుమార్ రెడ్డి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని టిఆర్ఎస్ ఎమ్మెల్యే కెటి రామారావు విమర్శించారు. విద్యార్థులు ఉద్యమంలో పాల్గొన్నందుకే సిఎం వారిని టార్గెట్ చేశారన్నారు. సీమాంధ్ర అధికారులపై తెలంగాణ ప్రజలకు నమ్మకం పోయిందన్నారు. తెలంగాణకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సిఎం ప్రకటించిన లక్ష ఉద్యోగాల్లో తెలంగాణకు ఎన్ని ఉద్యోగాలో చెప్పాలన్నారు.
English summary
TRS chief K Chandrasekhar Rao daughter
Kalvakuntla Kavitha make agitation at APPSC and
demanded for cancel gruop-1 exams.
Story first published: Monday, December 19, 2011, 13:05 [IST]