వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌ను పలకరించిన కెవిపి రామచందర్ రావు

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan-KVP Ramachandra Rao
న్యూఢిలీ: రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప లోకసభ సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని మంగళవారం పార్లమెంటు లాబీలో పలకరించారు. 'బాబూ బాగున్నావా..' అని ఆప్యాయంగా ఆయన జగన్‌ను పలకరించినట్లు కాంగ్రెసు వర్గాలు చెప్పాయి. కాగా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి రాజీవ్ శుక్లాతో జగన్ పార్లమెంట్ లాబీలో కొద్దిసేపు మంతనాలు జరిపారు. వారిద్దరూ ఏం చర్చించుకున్నారనే విషయం మాత్రం తెలియరాలేదు. జగన్ వర్గానికి చెందిన ఎంపీ సబ్బం హరి రాజీవ్‌శుక్లాతో పాటు ఎన్‌సీపీకి చెందిన ఇద్దరు ఎంపీలతో కూడా జగన్ మంతనాలు జరిపేందుకు వీలు కల్పించినట్లు తెలిసింది.

సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ తరఫున దౌత్యాలు నిర్వహించే రాజీవ్‌శుక్లాను జగన్ కలుసుకోవడం వెనుక అసలు విషయం ఏదో ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. అయితే ఆయన ఎదురైనప్పుడు కేవలం స్నేహపూర్వకంగానే కరచాలనం చేశానని జగన్ చెప్పగా, జగన్ వచ్చినప్పుడల్లా తనతో మాట్లాడుతుంటారని, ఆయన తన స్నేహితుడని శుక్లా చెప్పారు. రాష్ట్ర కాంగ్రెస్‌కు చెందిన పలువురు ఎంపీలు బహిరంగంగా కాకపోయినా లాబీలో జగన్‌ను కలిసి పలకరించినట్లు విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. తనపై ఉన్న కేసుల్లో బలం లేదని, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కేసులోనూ తనను తప్పుబట్టడానికి ఏమీ లేదని జగన్ సమర్ధించుకోవడం గమనార్హం. తాను ఈడీ ఎదుట హాజరవుతున్నట్లు వచ్చిన వార్తలను ఆయన కొట్టిపారేశారు.

English summary
Congress Rajyasabha member KVP Ramachandar rao has wished YSR Congress party president YS Jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X