వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జగన్ను పలకరించిన కెవిపి రామచందర్ రావు
సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ తరఫున దౌత్యాలు నిర్వహించే రాజీవ్శుక్లాను జగన్ కలుసుకోవడం వెనుక అసలు విషయం ఏదో ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. అయితే ఆయన ఎదురైనప్పుడు కేవలం స్నేహపూర్వకంగానే కరచాలనం చేశానని జగన్ చెప్పగా, జగన్ వచ్చినప్పుడల్లా తనతో మాట్లాడుతుంటారని, ఆయన తన స్నేహితుడని శుక్లా చెప్పారు. రాష్ట్ర కాంగ్రెస్కు చెందిన పలువురు ఎంపీలు బహిరంగంగా కాకపోయినా లాబీలో జగన్ను కలిసి పలకరించినట్లు విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. తనపై ఉన్న కేసుల్లో బలం లేదని, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులోనూ తనను తప్పుబట్టడానికి ఏమీ లేదని జగన్ సమర్ధించుకోవడం గమనార్హం. తాను ఈడీ ఎదుట హాజరవుతున్నట్లు వచ్చిన వార్తలను ఆయన కొట్టిపారేశారు.
Comments
ys jagan ysr congress kvp ramachandra rao new delhi వైయస్ జగన్ వైయస్సార్ కాంగ్రెసు కెవిపి రామచందర్ రావు రాజీవ్ శుక్లా
English summary
Congress Rajyasabha member KVP Ramachandar rao has wished YSR Congress party president YS Jagan.
Story first published: Wednesday, December 21, 2011, 9:37 [IST]