చిరంజీవి తిరుగుబాటు, ప్రజారాజ్యం పునరుద్ధరణ?
డబ్బులకు అమ్ముడుపోవాల్సిన అవసరం చిరంజీవికి లేదని ఆయన అన్నారు. చిరంజీవిని విమర్శించే హక్కు అంబటి రాంబాబుకు లేదని ఆయన అన్నారు. ఎస్టీకి చెందిన తుపాకుల మునెమ్మకు చిరంజీవి మాటకు కట్టుబడి పార్టీ టికెట్ ఇచ్చారని, ఆమెకు కోవూరు నియోజకవర్గంలో 24 వేల ఓట్లు వచ్చాయని, చిరంజీవిని చూసి ఓటు వేయడం వల్లనే ఆమెకు అన్ని ఓట్లు వచ్చాయని ఆయన అన్నారు. అవినీతిలో కూరుకుపోయిన అంబటి రాంబాబు వంటి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు చిరంజీవిని విమర్శించడానికి తగినవారు కాదని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే చిరంజీవికి కేంద్ర మంత్రి పదవి ఇస్తామని చెప్పారని, పదవి కోసమైతే ఆ రోజే చిరంజీవి కాంగ్రెసులోకి వెళ్లిపోయేవారని ఆయన అన్నారు.
Comments
chiranjeevi prajarajyam congress krishna reddy hyderabad చిరంజీవి ప్రజారాజ్యం కాంగ్రెసు కృష్ణా రెడ్డి హైదరాబాద్
English summary
Prajarajyam MLA Sridhar Krishna Reddy statement about revival of party created sensation political circles.
Story first published: Thursday, December 22, 2011, 13:33 [IST]