మద్దెలచెర్వు సూరి సోదరి గంగుల హేమలత అరెస్టు
తెలిసిన వివరాల ప్రకారం - సుధీర్ రెడ్డి, విష్ణువర్ధన్ రావు అనే ఇద్దరు వ్యక్తులు 2005లో మహేశ్వరంలోని 220 ఎకరాల భూమిని ఓ బెంగళూర్ వ్యక్తికి అమ్మజూపారు. అది వక్ఫ్ భూమి కావడంతో నోటీసులు జారీ అయ్యాయి. దాంతో అమ్మకం ఒప్పందం బెడిసి కొట్టింది. తన భూమి తనకు ఇవ్వాలని విష్ణువర్దన్ రావు సుధీర్ రెడ్డిపై ఒత్తిడి తెచ్చాడు. పైగా, డాక్టర్ శరత్చంద్ర సహకారంతో మద్దెలచెర్వు సూరి ముఠాను ఆశ్రయించాడు. దాంతో భాను కిరణ్, మధుమోహన్ రెడ్డి, తదితర సూరి గ్యాంగు సభ్యులు రంగప్రవేశం చేసి, సుధీర్ రెడ్డిని బెదిరించారు.
బెదిరిపోయిన సుధీర్ రెడ్డి గచ్చిబౌలిలో 5.15 ఎకరాల భూమిని ఇవ్వడానికి అంగీకరించాడు. ఆ భూమిని భాను కిరణ్ తన పేర రిజిష్టర్ చేయించుకున్నాడు. దీంతో ఆగ్రహించిన సూరి భూనును నిలదీశాడు. దాంతో భాను కిరణ్ 5 ఎకరాల భూమిని సూరి సోదరి హేమలత పేరు మీద రిజిష్టర్ చేశాడు. ఈ కేసులోనే హేమలతను సిఐడి పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.