వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిరణ్ ప్రభుత్వానికి కనిపించడం లేదు: వైయస్ జగన్

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jaganmohan Reddy
అనంతపురం: రైతులను పట్టించుకోవడం లేదంటూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అనంతపురం జిల్లాలో చేపట్టిన ఓదార్పు యాత్ర సందర్భంగా ఆయన ఎస్పి కుంటలో వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని ఆయన అన్నారు. గిట్టుబాటు ధర లేక, పెట్టుబడులు రాక రైతులు ఇబ్బందులు పడుతుంటే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి కనిపించడం లేదని ఆయన అన్నారు.

కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పేద ప్రజలతో చెలగాటమాడుతోందని ఆయన అన్నారు. విద్యా సంవత్సరం అయిపోవస్తున్నా విద్యార్థుల ఫీజు రీయంబర్స్‌మెంటును పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడని ఆయన అన్నారు. రచ్చబండను రొచ్చుబండగా మార్చిన ఘనత కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి దక్కుతుందని ఆయన అన్నారు.

English summary
YSR Congress party president YS Jagan has lashed out at CM Kiran kumar Reddy government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X