వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంత్రి శంకరన్నకు క్షీరాభిషేకం: దళిత ఆత్మగౌరవ సభ

By Pratap
|
Google Oneindia TeluguNews

Shankar Rao
హైదరాబాద్: రాష్ట్ర జౌళి శాఖ మంత్రి పి. శంకరరావుకు మంగళవారం సాయంత్రం క్షీరాభిషేకం జరిగింది. హైదరాబాదు సమీపంలోని ఎన్టీఆర్ నగర్‌లో ఆయనకు క్షీరాభిషేకం జరిగింది. ఆయనపై ఇటీవల దాడి జరిగిన స్థలంలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీయస్) నేత మందకృష్ణ మాదిగ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. శంకరరావుపై జరిగిన దాడికి నిరసనగా ఎమ్మార్పీయస్ దళిత ఆత్మగౌరవ సభను నిర్వహించింది.

హోమ్ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనపై దాడి చేయించారని శంకరరావు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. సబితా ఇంద్రారెడ్డిపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తుతూ వస్తున్నారు. ఆమెను మంత్రివర్గం నుంతి తొలగించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. తనపై దాడికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి, హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డిలే కారణమని ఆయన అంతకు ముందు ఆరోపించారు. వారిద్దరి నుండి తనకు ప్రాణహాని ఉందన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అవినీతిపరులను వెనకేసుకొస్తున్నారని విమర్శించారు. త్వరలో అవినీతి పరుల చిట్టా విప్పుతానని వారందరినీ శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపిస్తానని హెచ్చరించారు. హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఐదువేల కోట్లు ఎలా సంపాదించారో చెప్పాలని ప్రశ్నించారు.

English summary
MRPS workers did ksheerabhishekam to minister P Shankar Rao at LB Nagar near Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X