కిరణ్ కుమార్తో డిఎల్ రవీంద్రా రెడ్డి వాదులాట
104 సర్వీసుల్లో హెచ్ఎంఆర్ఐ అవసరానికి మించి ఉద్యోగులను నియమించిందని, ఎక్కువగా ఉన్న ఉద్యోగులను తొలగించే విషయంపై పరిశీలిస్తున్నామని డిఎల్ రవీంద్రా రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రితో ఏ విధమైన వాగ్వివాదం జరగలేదని ఆయన చెప్పారు. 108 సర్వీసులను నెలలోగా అందుబాటులోకి తెస్తామని ఆయన చెప్పారు. 104 సర్వీసులను ప్రభుత్వమే నిర్వహించాలా, కొత్త టెండర్లను ఆహ్వానించాలా అనే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు. అలాగే, ఆరోగ్యశ్రీ పథకాన్ని ట్రస్టు పద్ధతిలో నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. దానిపై అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. దీంతో జివికె నుంచి 108 సర్వీసులను తప్పిస్తారు.
Comments
dl ravindra reddy kiran kumar reddy arogyasri hyderabad డిఎల్ రవీంద్రా రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఆరోగ్యశ్రీ హైదరాబాద్
English summary
It is said that Health Minister DL Ravindra Reddy resorted verbal argument with CM Kiran kumar Reddy.
Story first published: Wednesday, December 28, 2011, 17:17 [IST]