బాబు! కాపలా కుక్కలను కంట్రోల్లో పెట్టుకో: టిఆర్ఎస్
రెండు కళ్ల సిద్ధాంతం ప్రవచిస్తున్న చంద్రబాబును తెలంగాణ నేతలు ఇప్పటికైనా విడిచి పెట్టాలన్నారు. మోత్కుపల్లి, ఎర్రబెల్లి వంటి నేతలు ఏం మాట్లాడుతున్నారో ఎవరికీ అర్థం కావడం లేదన్నారు. శ్రీకాంతచారి తల్లి గడ్డి పెట్టినా వారికి బుద్ధి రావడం లేదన్నారు. బాబు తన కాపలా కుక్కలను కంట్రోల్లో పెట్టాలన్నారు. తెలంగాణలోని ఆత్మహత్యలకు టిడిపియే కారణమన్నారు. వారిని చరిత్ర క్షమించదని ధ్వజమెత్తారు. తన హయాంలో రైతుల గురించి పట్టించుకోని బాబుకు రైతుల గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. బాబు పాదయాత్ర కాదు కదా మోకాళ్ల యాత్ర చేసినా డిపాజిట్లు రావన్నారు. చంద్రదండుకు వ్యతిరేకంగా తెలంగాణ దండు ఉందన్నారు.
English summary
TRS party leader Chandrasekhar warned to TDP chief Nara Chandrababu Naidu to control his party Telangana leaders.
Story first published: Wednesday, December 28, 2011, 12:36 [IST]