కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఓదార్పు యాత్రలో ఉపపోరుపై ఓటర్లకు జగన్ సూచన

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
కడప: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం కడప జిల్లాలోని తన ఓదార్పు యాత్రలో ఓటర్లకు సూచనలు చేశారు. వచ్చే ఉప ఎన్నికల్లో ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా తమ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన తన ఓదార్పు యాత్రలో ప్రజలను కోరారు. ఉప ఎన్నికల్లో ప్రలోభ పెట్టేందుకు అధికార పార్టీ సన్నద్ధమైందని కానీ మీరు మాత్రం ఢిల్లీకి దిమ్మ తిరిగేలా వైయస్సార్ కాంగ్రెసు అభ్యర్థిని గెలిపించాలన్నారు. తన వర్గం ఎమ్మెల్యేలు రైతులకు తోడుగా నిలిచి అవిశ్వాసానికి మద్దతు పలికారన్నారు. ఉప ఎన్నికల్లో రైతన్నే గెలుస్తాడని, తద్వారా ప్రభుత్వం కళ్లు తెరిపిస్తామన్నారు.

రైతు - రైతు కూలీ ఒకవైపు ఉంటే కుళ్లు రాజకీయ వ్యవస్థ మరోవైపు ఉందన్నారు. విశ్వసనీయతకు రాజకీయ నేతలు అర్థం మరిచారన్నారు. నేతలు దానిని పూర్తిగా పూడ్చి పెట్టారన్నారు. ప్రస్తుత రాజకీయాల్లో మార్పు తేవాల్సిన అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా తన ఓదార్పు యాత్రలో జగన్ నరసింహరాజు కుటుంబాన్ని ఓదార్చారు. పలు వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలను ఆవిష్కరించారు.

English summary
YSR Congress Party chief YS Jaganmohan Reddy suggested voters in his odarpu yatra that be careful with Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X