రంగారెడ్డి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎబివిపి కలెక్టరేట్ ముట్టడి ఉధ్రిక్తత, లాఠీఛార్జ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Karimnagar District
కరీంనగర్/రంగారెడ్డి: ఫీజు రీయింబర్సుమెంట్స్, స్కాలర్ షిప్స్ కోసం కలెక్టరేట్లను ముట్టడించిన అఖిల భారత విద్యార్థి పరిషత్(ఎబివిపి) విద్యార్థులపై పోలీసులు గురువారం లాఠీఛార్జ్ చేశారు. రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లో ఎబివిపి విద్యార్థులు ఫీజు రీయింబర్సుమెంట్స్ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్లను ముట్టడించారు. లోనికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. దీంతో ఇరువురి మధ్య తోపులాట జరిగింది. పోలీసులు విద్యార్థులపై లాఠీఛార్జ్ చేశారు. దీంతో పలువురి విద్యార్థులకు తీవ్రంగా గాయాలయ్యాయి.

విద్యార్థులపై లాఠీఛార్జికి నిరసనగా కరీంనగర్‌లో విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు. దీంతో అక్కడ ట్రాఫిక్ జాం అయింది. న్యాయపరంగా విద్యార్థులకు రావాల్సిన ఫీజులను మేం డిమాండ్ చేస్తున్నామని, ఫీజులు చెల్లిస్తే మేం ఆందోళన ఎందుకు చేస్తామని, న్యాయంగా అడిగితే పోలీసులు జులుం ఏమిటని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

English summary
Police make lati charge on ABVP students in Karimnagar and Rangareddy district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X