వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎపిపియస్‌సికి ట్రిబ్యునల్ షాక్: ఇంటర్వ్యూలకు బ్రేక్

By Pratap
|
Google Oneindia TeluguNews

APPSC logo
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఎపిపియస్‌సి)కి ట్రిబ్యునల్ షాక్ ఇచ్చింది. తెలుగు మీడియం అభ్యర్థులు దాఖలు చేసిన ఫిర్యాదుకు స్పందిస్తూ గ్రూప్ వన్ పరీక్షల ఇంటర్వ్యూలను ఆపేయాలని ట్రిబ్యునల్ ఎపిపియస్‌ని అదేశించింది. గ్రూప్ వన్ రాతపరీక్షల్లో తమకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ తెలుగు మీడియం అభ్యర్థులు ట్రిబ్యునల్‌కు వెళ్లారు. దీనిపై వాదోపవాదాలు విన్న తర్వాత తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు గ్రూప్ వన్ పరీక్షల ఇంటర్వ్యూలు నిలిపేయాలని ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణకు కేసును జనవరి 20వ తేదీకి వాయిదా వేసింది.

జనవరి 20వ తేదీ లోగా కౌంటర్ దాఖలు చేయాలని ట్రిబ్యునల్ ఎపిపియస్‌సిని ఆదేశించింది. నిజానికి, జనవరి 4వ తేదీ నుంచి ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని ఎపిపియస్‌సి ప్రకటించింది. అయితే, ఇప్పుడు అవి వాయిదా పడే అవకాశం ఉంది. ట్రిబ్యునల్ ఆదేశాలు తమకు అందిన తర్వాత న్యాయనిపుణులతో చర్చించి ఇంటర్వ్యూలు నిర్వహించాలా, వద్దా అనే విషయంపై నిర్ణయం తీసుకుంటామని ఎపిపియస్‌సి అధికారులు చెబుతున్నారు.

English summary
Tribunal orderd APPSC to stop interviews in group - 1 exams till forther orders issued.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X