ప్రత్యూష కేసులో శిక్ష తగ్గింపునకు సుప్రీంకు సిద్ధార్థ
సిద్ధార్థ రెడ్డికి నాంపల్లి కోర్టు విధించిన ఆరేళ్ల శిక్షా కాలాన్ని హైకోర్టు రెండేళ్లకు కుదిస్తూ తీర్పు చెప్పింది. రూ. 50 వేల జరిమానా విధించింది. ప్రస్తుతం సిద్ధార్థ రెడ్డి బెయిల్పై బయటే ఉన్నాడు. 15 రోజుల్లో లొంగిపోవాలని హైకోర్టు సిద్ధార్థ రెడ్డిని ఆదేశించింది. ఇప్పటికే సిద్ధార్థ రెడ్డి 115 రోజులు జైలులో గడిపాడు. హైకోర్టు తీర్పుపై ప్రత్యూష తల్లి సరోజిని స్పంధించారు. హైకోర్టులో తమకు న్యాయం జరగలేదని ఆమె అన్నారు. ప్రత్యూష మృతి వ్యవహారం అప్పట్లో తీవ్ర సంచలనం కలిగించింది. పలువురు పెద్దల కుమారులు ఆమె మృతికి కారణమంటూ ఆరోపణలు వచ్చాయి.
హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తాను సుప్రీంకోర్టుకు వెళ్తానని సరోజినీ చెప్పారు. తమకు హైకోర్టులో న్యాయం జరగలేదని ఆమె అన్నారు. మునుస్వామి ఇచ్చిన పోస్టుమార్టం నివేదికను పరిగణనలోకి తీసుకోలేదని చెప్పారు. తన కూతురుని చంపినవారికి దేవుడు తప్పకుండా శిక్ష విధిస్తాడని అన్నారు.