హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ వర్గం ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Nadendla Manohar
హైదరాబాద్: అవిశ్వాస తీర్మానం సమయంలో పార్టీ విప్ ధిక్కరించిన 17 మంది వైయస్ జగన్ వర్గం శాసనసభ్యులకు స్పీకర్ నాదెండ్ల మనోహర్ షోకాజ్ నోటీసులు ఇచ్చారు. పార్టీ విప్‌ను ధిక్కరించి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి సానుకూలంగా ఎందుకు ఓటు వేశారో సంజాయిషీ ఇవ్వాలంటూ ప్రజారాజ్యం, కాంగ్రెస్ పార్టీలలోని జగన్ వర్గానికి చెందిన 17 మంది ఎమ్మెల్యేలకు ఆయన షోకాజ్ నోటీసులు జారీచేశారు. విప్‌ను ధిక్కరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసిన ఎమ్మెల్యేలను వ్యక్తిగతంగా హాజరై తమ వాదనలు వినిపించాలని కోరుతూ నోటీసులు పంపారు. ఈ విషయంలో స్పీకర్ తనంతట తానే నిర్ణయం తీసుకునే వీలున్నా, సమన్యాయం పాటించాలన్న ఉద్దేశంతో అందరికీ సంజాయిషీ నోటీసులు పంపారు. విప్‌ను ధిక్కరించినందున పీఆర్పీకి చెందిన శోభా నాగిరెడ్డిని అనర్హురాలిగా ప్రకటించాలని కోరుతూ స్పీకర్‌కు పీఆర్పీ తరఫున ఆ పార్టీ విప్ వంగా గీత ఫిర్యాదు చేశారు. గత నెల 26న శోభానాగిరెడ్డికి, 27న 16 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులిచ్చారు.

26న పీఆర్పీ ఇచ్చే విప్ చెల్లదంటూ శోభానాగిరెడ్డి ఒక లేఖను స్పీకర్ మనోహర్‌కు రాసి సీల్డ్ కవర్‌లో ఉంచి శాసనసభ కార్యదర్శి రాజా సదారాంకు ఇచ్చారు. తన రాజీనామా లేఖను కూడా స్పీకర్‌కు అందజేయాలంటూ మరో కవర్ అందించారు. మరో మూడు రోజులకే తాను విప్‌ను ఎందుకు ధిక్కరించానో తెలియజేస్తూ మరో లేఖను స్పీకర్ కార్యాలయానికి ఫాక్స్ ద్వారా శోభా నాగిరెడ్డి పంపారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 16 మందిలో కొందరు మాత్రమే తమ వివరణ లేఖలను రాజా సదారాం ద్వారా స్పీకర్‌కు పంపారు. మరికొందరు ఫాక్స్‌లో స్పీకర్ కార్యాలయానికి తమ వివరణలు పంపారు. ఈ నెల 9 నుంచి విశాఖ జిల్లాకు వెళ్తున్నందున సంక్రాంతి తర్వాత జగన్‌వర్గ ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లను ఒక కొలిక్కి తేవాలని మనోహర్ నిర్ణయించారు. దీంతో ఈనెల 18 నుంచి 21లోగా హాజరు కావాలంటూ 17 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు పంపారు.

ఈ నోటీసుల ప్రకారం ఒక సిట్టింగ్‌లోనే స్పీకర్ నిర్ణయం తీసుకునే వీలుందని అసెంబ్లీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 18న శోభా నాగిరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి. 19న అమర్నాథరెడ్డి, శ్రీకాంతరెడ్డి, కొండా సురేఖ, బాలినేని శ్రీనివాసరెడ్డి, ధర్మాన కృష్ణదాసు, గొల్ల బాబూరావు. 20న గుర్నాథరెడ్డి, చెన్నకేశవరెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, ప్రసాదరాజు, పిల్లి సుభాష్ చంద్రబోస్, సుచరిత. 21న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, బాలరాజు, కె.శ్రీనివాసులు స్పీకర్ ముందు హాజరు కావాల్సి ఉంటుంది.

English summary
Speaker Nadendla Manohar issued notices to YSR Congress president YS Jagan camp MLAs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X