వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బాబు, లగడపాటిల్లో మార్పు: తెలంగాణపై బాపూజీ
తెలంగాణ వస్తే తమ ద్వారా మాత్రమే రావాలనే తత్వంతో ఒక చిన్న పార్టీ పేచీ పెడుతోందని ఆయన తెలంగాణ రాష్ట్ర సమితిని ఉద్దేశించి అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు అధినేత వైయస్ జగన్ యువకుడు అయినందున తొందరపాటుతో వ్యవహరిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పార్టీల ప్రయోజనాలు తప్ప చిత్తశుద్ధి లేకపోవడమే తెలంగాణకు ప్రధాన ఆటంకమవుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. మూడు ప్రాంతాల ప్రజలను రెచ్చగొట్టే చర్యలను ఆపాలని ఆయా ప్రాంతాల నాయకులను ఆయన కోరారు. ప్రజల ఆకాంక్ష మేరకు ఈ నెల 11వ తేదీన గాంధీభవన్ ప్రకాశం హాల్లో మూడు ప్రాంతాల నాయకులను కలిపి సద్భావనా సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. శాంతియుతంగా విడిపోయేందుకు అనుసరించాల్సిన విధానాలపై చర్చిస్తామని ఆయన చెప్పారు.
Comments
konda laxman bapuji telangana chandrababu naidu ys jagan కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ చంద్రబాబు నాయుడు వైయస్ జగన్
English summary
Telangana freedom fighter Konda Laxman Bapuji has seen change in TDP president N Chandrababu Naidu and Congress MP Lagadapati rajagopal.
Story first published: Monday, January 9, 2012, 19:09 [IST]