వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ వర్గ ఎమ్మెల్సీలపై మండలి చైర్మన్‌కు ఫిర్యాదు

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన ముగ్గురు ఎమ్మెల్సీలపై కాంగ్రెసు పార్టీ శాసన మండలి చైర్మన్ చక్రపాణికి ఫిర్యాదు చేసింది. తమ పార్టీ గుర్తు మీద పోటీ చేసిన ముగ్గురు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ విప్ శివరామిరెడ్డి చక్రపాణికి శుక్రవారం ఓ లేఖను అందించారు. ఎమ్మెల్సీలు పుల్లా పద్మావతి, కొండా మురళి, మోహన్ రెడ్డిలపై ఆయన శాసన మండలి చైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ముగ్గురు ఎమ్మెల్సీలు కూడా వైయస్ జగన్‌కు మద్దతు ప్రకటిస్తూ ఆయన వెంట నడుస్తున్నారు.

కొండా మురళి పరకాల శాసనసభ్యురాలు కొండా సురేఖ భర్త. వీరిద్దరు కూడా మొదటి నుంచీ వైయస్ జగన్‌కు మద్దతు ప్రకటించడమే కాకుండా వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చురుగ్గా పనిచేస్తున్నారు. పుల్లా పద్మావతి మాత్రం వైయస్ జగన్‌పై అలిగినట్లు వార్తలు వస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో వైయస్ జగన్ చేపట్టిన రైతు దీక్షకు ఆమె హాజరు కాలేదు. తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదనే ఉద్దేశంతో ఆమె జగన్‌కు దూరమైనట్లు చెబుతున్నారు. వైయస్ జగన్ వర్గానికి చెందిన తమ పార్టీ శాసనసభ్యులపై కాంగ్రెసు పార్టీ ఇప్పటికే స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. మరో ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర రావుపై మాత్రం ఫిర్యాదు చేయలేదు. ఆయనపై ఏ విధంగా ఫిర్యాదు చేయాలనే విషయంపై కాంగ్రెసు పార్టీలో చర్చ జరుగుతోంది.

English summary
Congress has complained against YSR Congress president YS Jagan camp MLCs to council chairman Chakrapani.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X