హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ వర్గం ఎమ్మెల్సీలకు చక్రపాణి నోటీసులు

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన ముగ్గురు కాంగ్రెసు ఎమ్మెల్సీలకు శాసనస మండలి చైర్మన్ చక్రపాణి మంగళవారం నోటీసులు జారీ చేశారు. వారిపై అనర్హత వేటుకు కాంగ్రెసు విప్ శివరామిరెడ్డి ఇటీవల చక్రపాణికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. వారంలోగా వివరణ ఇవ్వాలని చక్రపాణి ఎమ్మెల్సీలు పుల్లా పద్మావతి, కొండా మురళి, ఎస్వీ మోహన్ రెడ్డిలను ఆదేశించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున వారిపై అనర్హత వేటు వేయాలని కాంగ్రెసు విప్ శివరామిరెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ ముగ్గురు ఎమ్మెల్సీలు కూడా మొదటి నుంచి జగన్ వెంట నడుస్తున్నారు.

కాగా, మరో ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ రావుపై కాంగ్రెసు పార్టీ ఫిర్యాదు చేయలేదు. జూపూడి ప్రభాకర రావు వైయస్ జగన్‌కు చెందిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి అధికార ప్రతినిధిగా కూడా వ్యవహరిస్తున్నారు. వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులపై అనర్హత వేటుకు కాంగ్రెసు పార్టీ శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. శాసనసభ్యులు రేపటి నుంచి వరుసగా మనోహర్ ముందు హాజరై తమ వాదనలు వినిపించనున్నారు. తమపై అనర్హత వేటు వేయాలని జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులు కోరుతున్నారు.

English summary
Legislative council Chairman Chakrapani has issued notices to YSR Congress party president YS Jagan camp MLCs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X