హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎన్టీఆర్ ఫ్యామిలీ రాజకీయాల్లోకి వస్తే టిడిపికి లైఫ్: గోనె

By Srinivas
|
Google Oneindia TeluguNews

Gone Prakash Rao
హైదరాబాద్: స్వర్గీయ నందమూరి తారక రామారావు కుటుంబ సభ్యులు రాజకీయాల్లోకి వస్తేగాని రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బతకదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత గోనె ప్రకాశ్ రావు శుక్రవారం అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాల ఏర్పాటుపై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అవాస్తవ ప్రచారం మానుకోవాలని సూచించారు. సంస్కారహీనంగా మాట్లాడితే రాష్ట్ర ప్రజలు చంద్రబాబుకు బుద్ధి చెబుతారన్నారు. వైయస్ఆర్‌పై అభిమానంతో ప్రజలు విగ్రహాలను ఏర్పాటు చేసుకుంటున్నారన్నారు. ప్రజల అభీష్టం మేరకు ఏర్పాటు చేసుకుంటున్న విగ్రహాలను ఉపయోగించుకొని రాజకీయపబ్బం గడుపుకోవాలని చంద్రబాబు చూడటం శోచనీయమన్నారు. 2014 ఎన్నికల్లో అధికారంలోకి రావాలంటూ పగటి కలలు కంటున్న బాబు ఉప ఎన్నికల్లో తన స్థానం ఏమిటో నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. రాష్ట్రవ్యాప్తంగా కేవలం పద్దెనిమిది వేల వైయస్ విగ్రహాలే ఉన్నాయన్నారు. వైయస్సార్, జగన్‌లపై గోబెల్స్ ప్రచారం వద్దన్నారు.

రైతులపై చంద్రబాబు చూపిస్తున్నది కపట ప్రేమ అని టిటిడి మాజీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో అన్నారు. సొంత జిల్లాలోనే చంద్రబాబుకు ఆదరణ కరువైందన్నారు. ప్రజలు అభిమానంతో ఏర్పాటు చేసుకుంటున్న వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలపై చెయ్యి వేస్తే ప్రజలు నడి రోడ్డుపై ఆయనను శిక్షిస్తారని ధ్వజమెత్తారు. బాబు చేసే యాత్రలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు.

English summary
YSR Congress Party leader Gone Prakash Rao suggested that Telugudesam Party will strengthen with only NTR family.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X