వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జగన్తో ఒప్పందంతోనే శంకరరావుకు ఉద్వాసన: టిడిపి
తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసేందుకు కాంగ్రెసు పార్టీ పవర్ గేమ్ ఆడుతోందని తెలుగుదేశం మరో నాయకుడు గాలి ముద్దు కృష్ణమ నాయుడు అన్నారు. సమన్వయ కమిటీ పేరుతో ప్రభుత్వ అంశాలను కాంగ్రెసు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ సమీక్షించడాన్ని ఆయన తప్పు పట్టారు. ఆజాద్ అధికారిక సమావేశాలు నిర్వహించడం తగదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి పనితీరును, ప్రభుత్వ వ్యవహారాలను శాసనసభ లేదా మంత్రి వర్గం మాత్రమే సమీక్షించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. సమన్వయ కమిటీలో ఉన్నవారంతా ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నవారేనని ఆయన అన్నారు. మరో ఇద్దరు ముఖ్యమంత్రులు మారినా ఆశ్చర్యం లేదని ఆయన అన్నారు.
Comments
baireddy rajasekhar reddy gali muddukrishnama naidu telugudesam బైరెడ్డి రాజశేఖర రెడ్డి గాలి ముద్దు కృష్ణమ నాయుడు తెలుగుదేశం
English summary
TDP leaders Baireddy Rajasekhar Reddy and Gali Muddukrishnama Naidu lashed out at Congress.
Story first published: Monday, January 23, 2012, 14:59 [IST]