వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మాజీ ఉప ముఖ్యమంత్రి జగన్నాథరావు కన్నుమూత
1969లో వచ్చిన తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ప్రభుత్వం ఆయనను తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి మండలి చైర్మన్గా నియమించారు. కాంగ్రెస్ రాజకీయాల్లో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వర్గీయుడిగా జగన్నాథరావు కొనసాగారు. కేశవరావు, హనుమంతరావు, డి.శ్రీనివాస్ వంటి వారు అప్పట్లో ఆయన శిష్యులే. జగన్నాథరావుకు భార్య వనమాల, ఒక కుమారుడు శ్రీనివాస్, ఇద్దరు కూతుళ్లు శైలజ, నీరజ ఉన్నారు. సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రి పొన్నాల లక్ష్మయ్య, కేసీఆర్ తదితరులు నివాళి అర్పించి కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు.
Comments
English summary
Former deputy Chief Minister C Jagannatha Rao dead at his residence in Hyderabad.
Story first published: Tuesday, January 24, 2012, 8:14 [IST]