హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరంజీవిని తెలంగాణ ప్రజలు గాడిదనెక్కిస్తారు: రేవంత్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Revanth Reddy
హైదరాబాద్: చేవెళ్ల - ప్రాణహిత ప్రాజెక్టు కోసం తెలంగాణ ప్రజలు తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవిని గాడిదనెక్కిస్తారని తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి బుధవారం విమర్శించారు. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ టిడిపి తెలంగాణ ఫోరం ఆధ్వర్యంలో ఉదయం దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేసిన శిలాపలకం వద్ద ఆందోళన చేశారు. శిలాపలకానికి నల్ల గుడ్డ కప్పి వారు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు జాతీయ హోదా కోసం చిరంజీవి గుర్రమెక్కితో ప్రాణహిత ప్రాజెక్టు కోసం తెలంగాణ ప్రజలు గాడిదనెక్కిస్తారన్నారు. ఒక రాష్ట్రానికి ఒకే ప్రాజెక్టు అనే మాట అయితే మా తెలంగాణ రాష్ట్రం మాకు ఇచ్చేయండని డిమాండ్ చేశారు. హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డికి ప్రాణహిత గుర్తుకు రావడం లేదా అని ప్రశ్నించారు.

ఈ ప్రాజెక్టు జాతీయ హోదాపై చేవెళ్ల చెల్లెమ్మ ఇప్పటి వరకు ఎందుకు మాట్లాడటం లేదని అడిగారు. జాతీయ హోదా ఇవ్వడానికి ఉత్తర ప్రదేశ్‌కు లేని నిబంధనలు మన రాష్ట్రానికే ఉన్నాయా అన్నారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా మన రాష్ట్రంలోనే ప్రాజెక్టుల కోసం టెండర్లు పిలుస్తున్నారని విమర్శించారు. జలయజ్ఞంలో భారీగా కుంభకోణం జరిగిందన్నారు. అవినీతి మురికై పారిందన్నారు. కాగా ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి దేవేందర్ గౌడ్, ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర రావు, మహేందర్ రెడ్డి, కెఎస్ రత్నం తదితరులు పాల్గొన్నారు.

English summary
TDP MLA Revanth Reddy lashes out at Tirupati MLA Chiranjeevi for his attitude on Pranahitha project.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X