పల్నాడులో వ్యాట్పై పోటా పోటీ: జగన్ వర్సెస్ కోడెల
వస్త్ర వ్యాపారులకు మద్దతు పేరుతో టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు ఆందోళనకు ఒకేరోజు దిగేందుకు సిద్ధం కావడంతో పోలీసులు టిడిపికి ఉదయం తొమ్మిది గంటల నుండి పదకొండు గంటల వరకు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి పదకొండు గంటల తర్వాత అనుమతి ఇచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని, ఎటువంటి పరిస్థితులు తలెత్తినా అందుకోసం తాము అప్రమత్తంగా ఉన్నామని పోలీసులు చెబుతున్నారు. భారీగా పోలీసులను మోహరించారు. ఆందోళన విషయంలో వెనక్కి తగ్గేది లేదని ఇరుపార్టీలో చెబుతున్నాయి. మొత్తానికి పల్నాడులో రెండు పార్టీల ఆందోళన ఘాటెక్కిస్తోంది.
Comments
English summary
Guntur politics heated with YSR Congress Party and Telgudesam Party agitation against VAT at Narasaraopet.
Story first published: Friday, January 27, 2012, 9:39 [IST]