వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కోనేరు ప్రసాద్ తనయుడు మధు విచారణ వదంతులే
కోనేరు ప్రసాద్కు ఇద్దరు కొడుకులు. మధు దుబాయ్లో ఉంటున్నారు. దీంతో సిబిఐ ప్రధానంగా ఈయన పైనే దృష్టి సారించింది. ఎమ్మార్ కేసులో దుబాయ్లో ఉంటున్న మధు ఖాతాలోకి నిధులు మళ్లించారని సిబిఐ అనుమానిస్తోంది. ఇటీవల సునీల్ రెడ్డి అరెస్టు సైలెంట్గా జరిగింది. ఆయనను రెండు రోజుల పాటు విచారించిన సిబిఐ ఆ తర్వాత అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించింది. దాంతో కోనేరు ప్రసాద్ను కూడా సిబిఐ చడీచప్పుడు లేకుండా రప్పించిందని మీడియా భావించింది. కానీ అది తప్పుగా తేలిపోయింది. కాగా గతంలో పలుమార్లు కోనేరు మధుకు సిబిఐ నోటీసులు జారీ చేసినప్పటికీ ఆయన నుండి ఎలాంటి స్పందన లేదు.
Comments
English summary
It is clarified that CBI has not grilled Loneru Prasad's son Koneru Madhu, who is in dubai.
Story first published: Saturday, January 28, 2012, 9:34 [IST]