వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హాజరు కాను: స్పీకర్‌కు మళ్లీ జగన్‌వర్గం ఎమ్మెల్యే లేఖ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kapu Ramachandra Reddy
హైదరాబాద్: తాను విచారణకు హాజరు కానని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం శాసనసభ్యుడు కాపు రామచంద్రా రెడ్డి సోమవారం స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు మరోసారి లేఖ రాశారు. గతంలో విచారణకు హాజరు కాకపోవడంతో స్పీకర్ ఫిబ్రవరి రెండో తేదిన హాజరు కావాలని నోటీసులు పంపించారు. ఇందుకు ఆయన సోమవారం తాను హాజరు కాబోనని చెబుతూ స్పీకర్‌కు లేఖ రాశారు. సిఎల్పీ చేసిన ఫిర్యాదులు, ప్రభుత్వం విప్ జారీ చేసిన నోటీసులు, సర్టిఫైడ్ కాపీలు తనకు పంపమని కోరినప్పటికీ ఇవ్వలేదని లేఖలో పేర్కొన్నారు. సిఎల్పీ లేఖ తనకు అందలేదని చెప్పారు. కాబట్టి తాను హాజరు కానన్నారు.

కాగా గత సంవత్సరం డిసెంబర్‌లో తెలుగుదేశం పార్టీ ప్రవేశ పెట్టిన అవిశ్వాసానికి పార్టీ విప్ ధిక్కరించి ఓటు వేసిన వారిలో కాపు రామచంద్రా రెడ్డి ఒకరు. పార్టీ విప్ ధిక్కరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసినందుకు వివరణ అడగ్గా, తనకు పార్టీ విప్ అందలేదని ఆయన గతంలో చెప్పిన విషయం తెలిసిందే. ఇటీవల 18వ తారీఖున ఆయన స్పీకర్ ఎదుట హాజరు కావాల్సి ఉన్నప్పటికీ ఆయన హాజరు కాలేదు.

English summary
YSR Congress party chief YS Jaganmohan Reddy camp mla Kapu Ramachandra Reddy wrote a letter to speaker Nadendla Manohar today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X