వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విగ్రహాల విధ్వంసంలో చిరంజీవి పాత్ర: మందకృష్ణ మాదిగ

By Pratap
|
Google Oneindia TeluguNews

Manda Krishna Madiga
మహబూబ్‌నగర్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాల కూల్చివేత విషయంలో కాంగ్రెస్ నేత, చిత్తూరు శాసనసభ్యుడు చిరంజీవిపై మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీయస్) నేత మందకృష్ణ మాదిగ సంచలన ఆరోపణ చేశారు. విగ్రహాల విధ్వంసంలో చిరంజీవి హస్తముందని ఆయన ఆరోపించారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో ఓ కార్యక్రమంలో పాల్గనడానికి వచ్చిన ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

విగ్రహాల ధ్వంసంపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే హైకోర్టు కూడా ఈ కేసును సుమోటోగా స్వీకరించి న్యాయ విచారణ జరపాలని మంద కృష్ణ అన్నారు. అంబేడ్కర్ విగ్రహాల ధ్వంసంపై కాంగ్రెసు దళిత శానససభ్యులు, మంత్రులు సోమవారం హైదరాబాదులో సమావేశమయ్యారు. విగ్రహాల విధ్వంసంపై వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అంబేడ్కర్ విగ్రహాల విధ్వంసంపై విప్లవ రచయితల సంఘం (విరసం) నేత కళ్యాణరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజీవ్ గాంధీ, ఇతరుల విగ్రహాలు ధ్వంసం చేయకుండా అంబేడ్కర్ విగ్రహాలను మాత్రమే ధ్వంసం చేయడం వెనక కుట్ర ఉందని ఆయన అన్నారు.

English summary
MRPS leader Manda Krishna Madiga accused that Chiranjeevi's role is there in Ambedkar statues destruction.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X