వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మిస్టర్ ఫర్‌ఫెక్ట్!, తానేమీ బాబులా దాచలేదన్న బొత్స

By Srinivas
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana
న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడిలా తాను ఏదీ దాచుకోలేదని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మంగళవారం న్యూఢిల్లీలో అన్నారు. తన పేరున ఎక్కడా మద్యం దుకాణాలు ఉన్నట్లు చెప్పలేదన్నారు. తన కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులకు ఉన్న వ్యాపారాల గురించి మాత్రమే చెప్పానన్నారు. వాటిని కూడా నిబంధనల ప్రకారమే నడపాలని వారికి సూచించినట్లు చెప్పారు. తాను ఉన్న విషయాలు చెప్పానని, బాబులా తానేమీ దాచుకోలేదన్నారు. అదే చంద్రబాబుకు, మాకు మధ్య ఉన్న తేడా అని ఆయన అన్నారు. తన వారు వ్యాపారంలో ఎక్కడా గీత దాటలేదన్నారు. రాజీవ్ యువకిరణాల ప్రారంభానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని రావాలని కోరినట్లు చెప్పారు. ఆయన రాక రద్దు కాలేదని వాయిదా పడిందన్నారు. ఆయనకు ఉన్న అనుమానాలను నివృత్తి చేసినట్లు చెప్పారు. వాయిదా పడినట్లు వార్తలు వస్తున్నాయని ఇలాంటి విమర్శలు సహజమేనన్నారు.

రాష్ట్రంలోని రైతులకు ధాన్యానికి గిట్టుబాటు ధర లభించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్పత్తి వ్యయానికి మధ్య లభిస్తున్న ధర మధ్య అగాథం నెలకొందన్నారు. రాష్ట్రాల స్థితిగతుల ఆధారంగా ధాన్యం కొనుగోలు ధరలు ఉండాలని అభిప్రాయపడ్డారు. గ్రామీణ రవాణా రంగాన్ని మెరుగుపర్చేందుకు కేంద్రం సహకరించాలన్నారు. పోలవరం, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుల జాతీయ హోదాపై పెద్దలతో చర్చించినట్లు చెప్పారు. పవర్ ప్లాంట్ల ఏర్పాట్ల కంటే ముందు పునరావాస చర్యలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. దీనికోసం సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలని అధిష్టానాన్ని కోరినట్లు చెప్పారు.

English summary
PCC chief Botsa Satyanarayana said that he is not like TDP chief Nara Chandrababu Naidu to hide.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X