హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నియంత్రణలోకి వచ్చిన ఐఎఎస్ బిపి ఆచార్య రక్తం పోటు

By Pratap
|
Google Oneindia TeluguNews

BP Acharya
హైదరాబాద్: ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో అరెస్టయిన ఐఎఎస్ అధికారి బిపి ఆచార్య ఆరోగ్యం కుదుట పడినట్లు తెలుస్తోంది. గుండె నొప్పితో బాధపడుతున్న ఆచార్యను సిబిఐ అధికారులు మంగళవారం సాయంత్రం నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్)లో చేర్చారు. గుండెకు సంబంధించిన అన్ని పరీక్షలు వైద్యులు చేశారు. ఈసిజి, ఆంజియోప్లాస్ట్, ఎకో పరీక్షలు చేశారు. ఆయన రక్తం పోటు (బిపి) సాధారణ స్థితిలో ఉందని వైద్యులు చెప్పారు. దాంతో విచారణ నిమిత్తం బిపి ఆచార్యను సిబిఐ అధికారులు దిల్‌కుషా అతిథి గృహానికి తరలించే అవకశాలున్నట్లు తెలుస్తోంది. బిపి ఆచార్య సిబిఐ కస్టడీ సాయంత్రం 4 గంటలకు ముగుస్తుంది.

బిపి ఆచార్యను ప్రత్యేక కోర్టు సిబిఐ కస్టడీకి అప్పగించింది. మంగళవారం ఉదయం నుంచే బిపి ఆచార్య అనారోగ్యంతో బాధపడుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఆయనకు మంగళవారం ఉదయం కూడా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయనకు గ్లూకోస్ అందించాల్సి ఉంటుందని వైద్యులు ఆ సమయంలో చెప్పారు. అయితే, అకస్మాత్తుగా ఆయనకు గుండె నొప్పి రావడంతో మంగళవారం సాయంత్రం నిమ్స్‌కు తరలించారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసులో బిపి ఆచార్య ప్రధాన నిందితుడు.

English summary
It is learnt that, IAS officer BP Acharya arrested in EMAAR case, BP is in control.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X