బిపి ఆచార్య పేరు చేరుస్తూ 12మందిపై ఛార్జీషీట్ దాఖలు
ఎమ్మార్ విల్లాలో ఎపిఐఐసి వాటా భారీగా తగ్గినట్లుగా సిబిఐ గుర్తించినట్లు ఛార్జీషీట్లో పేర్కొన్నారు. ఎమ్మార్ విల్లాల్లో భారీ అక్రమాలు జరిగాయని, ఎపిఐఐసి ప్రమేయం లేకుండానే విల్లాల విక్రయం జరిగిందని అందులో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. ఛార్జీషీట్లో బిపి ఆచార్య, ఎమ్మార్ ప్రాపర్టీస్, మహ్మద్ అల్ అబర్, ఎమ్మార్ ఎంజిఎఫ్, ఎమ్మార్ హిల్స్, కోనేరు ప్రసాద్, శ్రీకాంత్, బౌల్డర్ హిల్స్, ఎల్వీ సుబ్రహ్మణ్యం, కె.విశ్వేశ్వర రావు, తుమ్మల రంగారావు, కోనేరు మధు పేర్లను ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది. ఛార్జీషీట్లో ముగ్గురు ఐఏఎస్లను నిందితులుగా పేర్కొన్నట్లు తెలుస్తోంది. విజయ రాఘవ, సునీల్ రెడ్డి, శ్రవణ్ గుప్త పేర్లను ప్రస్తావించలేదు.
కాగా సునీల్ రెడ్డి, విజయ రాఘవ, కోనేరు ప్రసాద్ జ్యూడిషియల్ రిమాండును సిబిఐ ప్రత్యేక కోర్టు ఈ నెల 15వ తేది వరకు పొడిగించింది. సిబిఐ వేసిన కస్టడీ పిటిషన్ పైన ఇరువైపుల వాదనలు విన్న కోర్టు తీర్పును గురువారానికి వాయిదా వేసింది.