కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'తెలంగాణ' అంటే చిదంబరానికి నవ్వులాట: కిషన్ రెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kishan Reddy
కరీంనగర్: తెలంగాణ ఉద్యమం అంటే చిదంబరానికి నవ్వులాటగా ఉందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, అంబర్‌పేట శాసనసభ్యుడు కిషన్ రెడ్డి బుధవారం మండిపడ్డారు. కరీంనగర్ జిల్లాలో కిషన్ రెడ్డి తెలంగాణ పోరు యాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెసుపై నిప్పులు చెరిగారు. తెలంగాణపై తొలుత కాంగ్రెసు పార్టీ తన వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారంలో ఉన్న కాంగ్రెసు ఇప్పటి వరకు ఎందుకు తన అభిప్రాయాన్ని చెప్పడం లేదని ప్రశ్నించారు. తెలంగాణపై రోజుకో మాట మాట్లాడుతున్న చిదంబరానిది నాలుకా తాటి మట్టా అని ధ్వజమెత్తారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని ఆరో అధ్యాయంలో భాగంగానే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి లక్ష ఉద్యోగాల ప్రకటన చేశారని విమర్శించారు. తెలంగాణలో బిజెపి పోరు యాత్ర వల్ల ప్రజల్లో విశ్వసనీయత పెరిగిందన్నారు. తెలంగాణ కోసం ఏడువందల మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బిజెపి అధికారంలోకి వస్తే తెలంగాణ బిల్లు పెడుతుందన్నారు. వ్యాట్ వల్ల వ్యాపారులకు, ప్రజలకు తీవ్ర ఇబ్బందులను, దానిని వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

తెలంగాణలో బిజెపి చేస్తున్నది పోరు యాత్ర కాదని భరోసా యాత్ర అని ఆ పార్టీ నేత, మాజీ శాసనసభ్యుడు ధర్మారావు వేరుగా వరంగల్ జిల్లాలో అన్నారు. బిజెపి అధికారంలోకి రాగానే తెలంగాణ ఇస్తుందన్నారు. తెలంగాణపై కాంగ్రెసు తన వైఖరి వెంటనే తెలియజేయాలన్నారు. పోరు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. 2,3,4 తేదీల్లో కిషన్ రెడ్డి యాత్ర వరంగల్‌లో ఉంటుందని చెప్పారు. కాగా గత నెల 19వ తేది నుండి కిషన్ రెడ్డి తెలంగాణలోని పలు జిల్లాల్లో పోరు యాత్ర నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

English summary
BJP state president Kishan Reddy blamed home minister Chidambaram for his statement on Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X