వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణపై జగన్ వైఖరిని ప్రశంసించిన కొండా సురేఖ

By Pratap
|
Google Oneindia TeluguNews

Konda Surekha
మహబూబ్‌నగర్: తెలంగాణపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వైఖరిని ఆయన వర్గానికి చెందిన కాంగ్రెసు శాసనసభ్యురాలు కొండా సురేఖ ప్రశంసించారు. తెలంగాణలో జరిగే ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను పోటీకి దించబోమని జగన్ చేసిన ప్రకటనను ప్రజలంతా హర్షిస్తున్నారని ఆమె అన్నారు. రాజకీయాల్లో ఇంకా విలువలు ఉన్నాయని చెప్పడానికి వైయస్ జగన్ నిర్ణయమే నిదర్శనమని ఆమె అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా షాద్‌నగర్‌లో ఆమె వైయస్ రాజశేఖర రెడ్డి, అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ప్రస్తుత కాంగ్రెసు ప్రభుత్వంపై ఆమె ధ్వజమెత్తారు. విద్యార్థులు, రైతులు, మహిళలను నిర్లక్ష్యం చేస్తున్న ప్రస్తుత కాంగ్రెసు ప్రభుత్వం ఎంతో కాలం అధికారంలో ఉండబోదని ఆమె అన్నారు. కరువు మండలాల్లో సహాయక చర్యలు చేపట్టాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

English summary
YSR Congress president YS Jagan camp MLA Konda Surekha applauded her leader's stand on Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X