వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎమ్మార్: సిబిఐ కస్టడీకి సునీల్ రెడ్డి, విజయ రాఘవన్

By Pratap
|
Google Oneindia TeluguNews

Sunil Reddy
హైదరాబాద్: ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో అరెస్టయిన సునీల్ రెడ్డిని, విజయ రాఘవన్‌ను సిబిఐ కస్డడీకి అప్పగిస్తూ కోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. సునీల్ రెడ్డిని మూడు రోజుల పాటు ఈ నెల 6వ తేదీ వరకు సిబిఐ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశించింది. కాగా, విజయ రాఘవన్‌ను ఐదు రోజుల పాటు ఈ నెల 8వ తేదీ వరకు సిబిఐ కస్టడీకి అప్పగించింది. ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఇద్దరు న్యాయవాదుల సమక్షంలో వారిని విచారించాలని కోర్టు సిబిఐని ఆదేశించింది. వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించకూడదని కోర్టు సిబిఐని ఆదేశించింది.

జైలు నుంచి ప్రతి రోజు ఉదయం తీసుకుని వెళ్లి మళ్లీ సాయంత్రం జైలుకు అప్పగించాలని ఆదేశించింది. జైలు నుంచి తీసుకుని వెళ్లే ముందు, జైలుకు తరలించే ముందు వారికి వైద్య పరీక్షలు నిర్వహించాలని కూడా కోర్టు ఆదేశించింది. ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసులో సిబిఐ అధికారులు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా భావిస్తున్న సునీల్ రెడ్డిని, విల్లాల విక్రయాల్లో ప్రధాన పాత్ర పోషించాడని భావిస్తున్న విజయరాఘవన్‌ను ఇటీవల అరెస్టు చేశారు. ఎమ్మార్ కుంభకోణం కేసులో సిబిఐ చార్జిషీట్ దాఖలు చేసింది. అయితే, వీరిద్దరిపై చార్జిషీట్‌లో అభియోగాలు మోపలేదు.

English summary
Court has ordered for CBI custody to Sunil Reddy and Vijaya Raghavan in EMAAR case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X