వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఎమ్మార్: సిబిఐ కస్టడీకి సునీల్ రెడ్డి, విజయ రాఘవన్
జైలు నుంచి ప్రతి రోజు ఉదయం తీసుకుని వెళ్లి మళ్లీ సాయంత్రం జైలుకు అప్పగించాలని ఆదేశించింది. జైలు నుంచి తీసుకుని వెళ్లే ముందు, జైలుకు తరలించే ముందు వారికి వైద్య పరీక్షలు నిర్వహించాలని కూడా కోర్టు ఆదేశించింది. ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసులో సిబిఐ అధికారులు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా భావిస్తున్న సునీల్ రెడ్డిని, విల్లాల విక్రయాల్లో ప్రధాన పాత్ర పోషించాడని భావిస్తున్న విజయరాఘవన్ను ఇటీవల అరెస్టు చేశారు. ఎమ్మార్ కుంభకోణం కేసులో సిబిఐ చార్జిషీట్ దాఖలు చేసింది. అయితే, వీరిద్దరిపై చార్జిషీట్లో అభియోగాలు మోపలేదు.
Comments
English summary
Court has ordered for CBI custody to Sunil Reddy and Vijaya Raghavan in EMAAR case.
Story first published: Friday, February 3, 2012, 15:29 [IST]