వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెవిపి ఇంటినుండే డబ్బు పంపిణీ, మంత్రుల పేర్లేవి: గాలి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Gali Muddukrishnama Naidu
హైదరాబాద్: ఎమ్మార్ కుంభకోణం కేసులో రాజకీయ నేతలను వదిలి కేవలం ఐఏఎస్ అధికారులను టార్గెట్ చేయడం ఏమిటని తెలుగుదేశం పార్టీ నేత గాలి ముద్దు కృష్ణమ నాయుడు శుక్రవారం ప్రశ్నించారు. ఎమ్మార్ కుంభకోణం కుట్రలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి, కెవిపి రామచంద్ర రావు కుటుంబాలకు భాగస్వామ్యం ఉందని ఆయన ఆరోపించారు. ఈ కుంభకోణంలో రాజకీయ నేతలకు 75 శాతం, అధికారులకు 25 శాతం బాధ్యత ఉందన్నారు. కెవిపి ఇంటి నుంచే డబ్బుల పంపిణీ జరిగిందని ఆరోపించారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలోని మంత్రివర్గానికి ఇందులో బాధ్యత ఉందన్నారు.

అప్పటి మంత్రులు కొణిజేటి రోశయ్య, గీతా రెడ్డి, బొత్స సత్యనారాయణలపై సిబిఐ ఎందుకు ఛార్జీషీట్ దాఖలు చేయలేదని ప్రశ్నించారు. ఐఏఎస్‌లను అరెస్టు చేస్తున్న వారు అస్సాం ఓటర్ల లిస్టులో ప్రధానిని చేర్చినందుకే ఐఏఎస్ భానును వదిలేశారని ఆరోపించారు. తెరవెనుక పెద్దలను వదిలి కేవలం అధికారులనే లక్ష్యంగా చేసుకోవడం సరికాదన్నారు. మంచి చెడులకు మంత్రివర్గమే బాధ్యత వహించాలన్నారు. కాంగ్రెసుకు అనుకూలంగా ఉంటే కేసులు పెట్టరా అని ప్రశ్నించారు. ఎంజిఎఫ్ ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ బినామీ కంపెనీ అని ఆరోపించారు.

English summary
TDP senior leader Gali Muddu Krishnama Naidu blamed KVP Ramachandra Rao for EMAAR issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X