హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ కేసు: ఐఎఎస్ రత్నప్రభను ప్రశ్నించిన సిబిఐ

By Pratap
|
Google Oneindia TeluguNews

CBI
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో సిబిఐ అధికారులు శనివారం ఐఎఎస్ అధికారి రత్నప్రభను ప్రశ్నించారు. ఆమెను సిబిఐ అధికారులు మూడున్నర గంటల పాటు విచారించారు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం హయాంలో ఆమె అర్బన్ ల్యాండ్ యుఎల్‌సిగా పనిచేశారు. అంతేకాకుండా సమాచార సాంకేతిక కార్యదర్శిగా కూడా పనిచేశారు. ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థలకు భూకేటాయింపులపై సిబిఐ ఆమెను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఇంతకు ముందు సిబిఐ అధికారులు ఐఎఎస్ అధికారులు అజయ్ మిశ్రాను, రమాకాంత్ రెడ్డిలను ప్రశ్నించిన విషయం తెలిసిందే.

కాగా, అనారోగ్యంతో ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో చేరిన ఐఎఎస్ అధికారి బిపి ఆచార్య కోలుకున్నారు. దీంతో ఆయనను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. ఆ తర్వాత ఆయనను హైదరాబాదులోని చంచల్‌గుడా జైలుకు తరలించారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసులో తొలి ముద్దాయి అయిన బిపి ఆచార్యను సిబిఐ అధికారులు ఇటీవల అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అరెస్టయినప్పటి నుంచి ఆయన ఏదో విధమైన అస్వస్థతతో బాధపడుతున్నారు. మరో వైపు ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసులో అరెస్టయిన విజయ రాఘవన్‌ను, సునీల్ రెడ్డిని సిబిఐ అధికారులు శనివారం విచారించారు. వారిద్దరిని కోర్టు సిబిఐ కస్టడీకి అప్పగించిన విషయం తెలిసిందే.

English summary
CBI has grilled IAS officer Ratnaprabha in YSR Congress president YS jagan assets case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X