వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అపాయింట్‌మెంట్ కోసం ఢిల్లీలో సిఎం ఎదురుచూపులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

kiran kumar reddy
న్యూఢిల్లీ: మంత్రి వర్గ విస్తరణ కోసం ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టానం పెద్దల అపాయింట్‌మెంట్ కోసం ఆదివారం నిరీక్షిస్తున్నారని తెలుస్తోంది. శనివారం ఉదయం ఢిల్లీ వచ్చిన కిరణ్ కేంద్ర మంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ అపాయింటుమెంట్ కోసం మధ్యాహ్నం వరకు వేచి చూడాల్సి వచ్చింది. ఆ తర్వాత 2జి కేసులో కేంద్ర హోంమంత్రి చిదంబరంకు ఊరట లభించే విధంగా తీర్పు రావడంతో కిరణ్‌కు అపాయింటుమెంట్ దొరికింది. సోనియాతో కేవలం ఐదు నిమిషాల్లోనే కిరణ్ భేటీ ముగిసింది. దీంతో సిఎం ఆదివారం మరోసారి వారిని కలిసేందుకు అక్కడే ఉన్నారు. అయితే ఉదయం నుండి నిరీక్షించినా ఆయనకు సాయంత్రం వరకు అపాయింటుమెంట్ దొరకలేదు. ఆయన మాత్రం సోనియా అపాయింటుమెంటు కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో విస్తరణకు అధిష్టానం సుముఖంగా లేనట్లుగా తెలుస్తోంది. సిఎం మాత్రం విస్తరణకు ఎలాగైనా అనుమతి తీసుకోవాలని పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నాలు సాగిస్తున్నారు.

శనివారం సోనియాతో భేటీ నిమిషాల్లోనే ముగిసి పోవడం, ఆదివారం సాయంత్రం వరకు అపాయింటుమెంటు దొరక్క పోవడంతో కేబినెట్ ఆశావహుల్లో అయోమయం నెలకొంది. కిరణ్ మంత్రి వర్గ విస్తరణ కోసమే ఢిల్లీ వెళ్లారనే వార్తల నేపథ్యంలో పలువురు నేతలు ఢిల్లీలో మకాం వేశారు. కేబినెట్లో చోటు దక్కించుకోవడం కోసం తమ వంతు ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే సిఎం ఎదురుచూపుల నేపథ్యంలో అసలు సిఎం వచ్చింది కేబినెట్ విస్తరణ అంశం గురించా లేక మరో విషయమా అనే ఆసక్తికరమైన చర్చకు తెరలేసింది.

English summary
CM Kiran Kumar Reddy is waiting for high command leaders appointment on sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X