హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వారంతా నీతివంతులుకాదు: ఐఏఎస్‌లపై ఆనం రుసరుస

By Srinivas
|
Google Oneindia TeluguNews

Anam Vivekananda Reddy
హైదరాబాద్: రాజకీయ నాయకులంతా అవినీతిపరులు కాదని, ఐఏఎస్‌లు అందరూ నీతిమంతులు కారని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శాసనసభ్యుడు ఆనం వివేకానంద రెడ్డి సోమవారం మండిపడ్డారు. అవినీతి మంత్రుల పేర్లు బయట పెట్టాలని ఆయన ఐఏఎస్‌లను డిమాండ్ చేశారు. అనవసరంగా నిందలు మోపకూడదన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ రంగు టైలు కట్టి, డ్రెస్సులు వేసి, ఆ పార్టీకి బాకా ఊదే ఐఏఎస్‌లు మాట్లాడం సరికాదన్నారు. రాజకీయాల్లో అవినీతిపరులు ఉండవచ్చు, కానీ నిజాయితీగా బతకాలనుకునే వారే ఎక్కువ అన్నారు. అలాగే అధికారుల్లోనూ అందరూ నీతివంతులు కాదని అవినీతిపరులు ఉన్నారన్నారు. ఉన్నత చదువులు చదివి ఉన్నత వ్యవస్థలో ఉన్న వారు మాట్లాడాల్సిన పద్ధతేనా అని ప్రశ్నించారు. వారికేమైనా తప్పు జరిగిందనిపిస్తే కోర్టుకు వెళ్లవచ్చని, కానీ విచారణ చేయడానికి వీలు లేదని ఎలా అంటారన్నారు. అవినీతి అధికారులకు మిగిలిన వారు మద్దతు ఇవ్వవద్దని విజ్ఞప్తి చేశారు.

మంత్రులను తప్పు పడుతున్న ఐఏఎస్‌ల పైన మరో ఎమ్మెల్యే ముత్యం రెడ్డి కూడా వేరుగా విరుచుకు పడ్డారు. మంత్రులు చెబితే మేం చేశామని చెప్పడాన్ని ఆయన తప్పు పట్టారు. అక్రమాలు జరిగాయని తెలిసినప్పుడు సంతకాలు ఎలా పెట్టారన్నారు. తప్పు జరుగుతున్నప్పుడు అది వారి దృష్టికి తీసుకు వెళ్లవచ్చు కదా అన్నారు. అంతగా ఒత్తిళ్లు మరేవైనా ఉంటే తప్పుకోవచ్చు లేదా లీవ్ పెట్టవచ్చు కదా అన్నారు.

English summary
SPS Nellore district MLA Anam Vivekananda Reddy fired at IAS officers for their attitude.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X