డిప్యూటీతో విభేదాల్లేవన్న జగ్గారెడ్డి, బాధ్యతేనన్న గండ్ర
ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారిస్తానని చీఫ్ విప్గా నియమితులైన గండ్ర వెంకట రమణా రెడ్డి అన్నారు. సమస్యల పరిష్కారమే తన లక్ష్యమన్నారు. మంత్రి పదవి వస్తుందని భావించానని, అయితే ఇది కూడా బాధ్యత కలిగిన పదవేనని అన్నారు. సామాజిక, ప్రాంతీయ సమీకరణాల కారణంగా తనకు పదవి రాలేదన్నారు. సమన్వయంతో హౌస్ను నడిపించేందుకు కృషి చేస్తామన్నారు. ప్రభుత్వానికి, పార్టీకి అండగా ఉంటామన్నారు. ఈ సమావేశాల్లో నిర్మాణాత్మక చర్చకు ప్రతిపక్షాలు కృషి చేయాలన్నారు. అందరినీ కలుపుకొని పోయి పని చేస్తానని అన్నారు.
ప్రభుత్వానికి శాసనసభకు మధ్య వారధిగా వ్యవహరిస్తూ సభా కార్యక్రమాలు సజావుగా సాగేలా చూస్తానని మరో విప్ ద్రోణంరాజు శ్రీనివాస్ విశాఖలో అన్నారు. తన సేవలను గుర్తించి తనకు పదవి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి, కాంగ్రెసు అధిష్టానానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
Comments
jagga reddy gandra venkataramana reddy telangana congress hyderabad జగ్గా రెడ్డి గండ్ర వెంకటరమణ రెడ్డి తెలంగాణ కాంగ్రెసు హైదారాబాద్
English summary
Jagga Reddy said that he is no differences with deputy cm Damodara Raja Narasimha. He hoped that Congress will win in bypoll.
Story first published: Thursday, February 9, 2012, 15:52 [IST]