వైయస్ రెక్కల కష్టంతోనే ప్రభుత్వాలు: వైయస్ జగన్
వైయస్ రాజశేఖర రెడ్డి మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలను పరామర్శిస్తానని నల్లకాలువలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నందుకే తనను ఇబ్బంది పాలు చేస్తున్నారని ఆయన అన్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. ప్రజా సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నా ప్రభుత్వాలకు చీమ కుట్టినట్లు కూడా లేదని ఆయన అన్నారు. రాష్ట్రంలో త్వరలో సువర్ణయుగం వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Comments
English summary
YSR Congress president YS Jagan lashed out at Congress and Telugudesam in his Guntur district Odarpu Yatra.
Story first published: Thursday, February 9, 2012, 17:55 [IST]