వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కిడ్నాప్కు గురైన రోశయ్య బంధువు మనోజ్ హత్య
మనోజ్ విశాఖపట్నంలో వైభవ్ జ్యువెల్లర్స్ దుకాణం నడుపుతున్నారు. గతంలో జరిగిన హత్యా యత్నం వ్యాపార లావాదేవీల కారణంగా అని తెలుస్తోంది. మనోజ్ హత్య వ్యాపార లావాదేవీల కారణంగా జరిగిందా లేక ఆయన వద్ద విలువైన వజ్రాలు ఉండటం కారణంగా జరిగిందా అనే కోణంలో కర్నాటక పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆయన వయస్సు 43 ఏళ్లు. ఒక స్థలాన్ని కొనుగోలు చేసేందుకు మనోజ్ కుమార్ మంగళవారం బెంగళూరు వెళ్లారు. ఈ విషయంపై కొందరు వ్యాపారులతో చర్చించారు. మంగళవారం మనోజ్ మిత్రులు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. ఈ విషయాన్ని తెలుసుకున్న మనోజ్కు బెంగళూరులో బంధువైన సతీష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కిడ్నాప్కు గురైనట్లు నమోదు చేసుకున్నారు. అయితే గురువారం ఉదయం ఆయన విగతజీవుడిగా కనిపించారు. ఆయన కుటుంబం శోకసముద్రంలో మునిగి పోయింది.
Comments
English summary
Tamilnadu governor Rosaiah's relative, Vaibhav jewellers owner Manoj Kumar found as dead in Karnataka today.
Story first published: Thursday, February 9, 2012, 11:14 [IST]