మరణించిన వైయస్పై విచారణా?: వైయస్ విజయమ్మ
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన భూకేటాయింపులపై కూడా విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ హయాంలోని భూకేటాయింపులపై కూడా విచారణ జరిపించాలని కొంత మంది శాసనసభ్యులు డిమాండ్ చేస్తున్నారని, అయితే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అందుకు సిద్ధంగా లేరని ఆమె అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డిని కాగ్, లోకాయుక్త కూడా తప్పు పట్లలేదని ఆమె గుర్తు చేశారు.
తెలుగుదేశం పార్టీతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారని, అందుకే వైయస్ ప్రభుత్వ హయాంలోని భూకేటాయింపులపై మాత్రమే సభా సంఘం వేశారని విజయమ్మ విమర్శించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కృష్ణపట్నం, గంగవరం ఓడరేవులు, రహేజా, ఓడ చెరువు, ఎమ్మార్, శంషాబాద్ విమానాశ్రయం, ఆరు పవర్ ప్రాజెక్టులు, కాకినాడ సీపోర్టు, విశాఖ ప్రాజెక్టు, ఎంఐజి భారత్ వంటి పలు ప్రాజెక్టులకు భూకేటాయింపులు జరిగాయని ఆమె శనివారం నాదెండ్ల మనోహర్కు రాసిన లేఖలో తెలిపారు.
వివిధ కేసుల్లో సిబిఐ ఐఎఎస్ అధికారులను మాత్రమే విచారించడం సరి కాదని, మిగతావారిని కూడా విచారించాలని ఆమె అన్నారు.