హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రత్యేక కెటగిరీ ఖైదీగా బిపి ఆచార్య: కోర్టు ఆదేశం

By Pratap
|
Google Oneindia TeluguNews

BP Acharya
హైదరాబాద్: ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసులో అరెస్టయిన ఐఎఎస్ అధికారి బిపి ఆచార్యను స్పెషల్ కెటగిరీ ఖైదీగా గుర్తిస్తూ హైదరాబాదులోని నాంపల్లి కోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆయనకు కొంత ఊరట లభించింది. దీనివల్ల ఆచార్యకు హైదరాబాదులోని చంచల్‌గుడా జైలులో ప్రత్యేక వసతులు ఒనగూరుతాయి. ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసులో ఆచార్య ప్రధాన నిందితుడు. అరెస్టయిన తర్వాత ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది.

ఎమ్మార్ అక్రమాల కేసులో ఐఏఎస్ అధికారి బిపి ఆచార్యను సిబిఐ అధికారులు జనవరి 30వ తేదీన అరెస్టు చేశారు. ఆయనపై పలు సెక్షన్ల క్రింద సిబిఐ కేసు నమోదు చేసింది. నేరపూరిత కుట్ర, మోసం, అకౌంట్లు తారుమారు చేశారనే పలు అభియోగాలు మోపింది. ఎమ్మార్ ఒప్పందంలో ఏపిఐఐసి వాటా తగ్గినా ప్రేక్షక పాత్ర వహించారని ఎఫ్ఐఆర్‌లో సిబిఐ ఆరోపించింది. ప్రభుత్వ వాటా తగ్గడంలో ఆయనదే కీలక పాత్ర అని, మిత్రులకు, సహచరులకు విల్లాలు కేటాయించడంలో సూత్రదారి అని ఎఫ్ఐఆర్‌లో పేర్కొంది.

English summary
Nampally court has ordered to provide facilities to BP Acharya under special category prisoner.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X