ప్రత్యేక కెటగిరీ ఖైదీగా బిపి ఆచార్య: కోర్టు ఆదేశం
ఎమ్మార్ అక్రమాల కేసులో ఐఏఎస్ అధికారి బిపి ఆచార్యను సిబిఐ అధికారులు జనవరి 30వ తేదీన అరెస్టు చేశారు. ఆయనపై పలు సెక్షన్ల క్రింద సిబిఐ కేసు నమోదు చేసింది. నేరపూరిత కుట్ర, మోసం, అకౌంట్లు తారుమారు చేశారనే పలు అభియోగాలు మోపింది. ఎమ్మార్ ఒప్పందంలో ఏపిఐఐసి వాటా తగ్గినా ప్రేక్షక పాత్ర వహించారని ఎఫ్ఐఆర్లో సిబిఐ ఆరోపించింది. ప్రభుత్వ వాటా తగ్గడంలో ఆయనదే కీలక పాత్ర అని, మిత్రులకు, సహచరులకు విల్లాలు కేటాయించడంలో సూత్రదారి అని ఎఫ్ఐఆర్లో పేర్కొంది.
Comments
English summary
Nampally court has ordered to provide facilities to BP Acharya under special category prisoner.
Story first published: Monday, February 13, 2012, 19:16 [IST]