హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ ఆస్తుల కేసులోనూ శ్రీలక్ష్మి, రాజగోపాల్

By Pratap
|
Google Oneindia TeluguNews

Srilakshmi-Rajagopal
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులోనూ ఐఎఎస్ అధికారులు శ్రీలక్ష్మి, రాజగోపాల్‌లను విచారించేందుకు సిబిఐ సిద్ధపడుతోంది. వారిద్దరి విచారణకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సిబిఐ మంగళవారం సిబిఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై విచారణను కోర్టు ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది. కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసులో అరెస్టయిన ఆ ఇద్దరు అధికారులు కూడా హైదరాబాదులోని చంచల్‌గుడా జైలులో ఉన్నారు.

వైయస్ జగన్ సంస్థల్లో పెట్టుబడుల పెట్టిన కంపెనీలకు ప్రయోజనం చేకూర్చే విధంగా వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో శ్రీలక్ష్మి, రాజగోపాల్ ద్వారా చర్యలు తీసుకున్నారనే అనుమానంపై సిబిఐ వారి విచారణకు అనుమతిని కోరినట్లు తెలుస్తోంది. దాల్మియా సిమెంట్స్, అన్‌రాక్ సంస్థలకు గనుల లీజుపై సిబిఐ అధికారులు వారిద్దరిని ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తాము స్వాధీనం చేసుకున్న పత్రాల ఆధారంగా వారిద్దరిని విచారించడం ద్వారా రాబట్టే సమాచారం ఆధారంగా జగన్ ఆస్తుల కేసులో పురోగతి సాధించవచ్చునని సిబిఐ అనుకుంటున్నట్లు సమాచారం.

కాగా, జగన్ ఆస్తుల కేసులో సిబిఐ మరో ప్రభుత్వాధికారి బాలకృష్ణను సిబిఐ అధికారులు మంగళవారం ప్రశ్నించారు. జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన పెన్నా సిమెంట్స్ వ్యవహారాలపై సిబిఐ అధికారులు బాలకృష్ణను విచారించినట్లు తెలుస్తోంది.

English summary
CBI filed petition seeking permission of court to grill IAS officers Srilakshmi and Rajagopal in YS Jagan assets case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X