ప్రచారం కోసమే చిరంజీవిపై బురద: టిడిపిపై కన్నబాబు
భవానీ ఐలాండ్ లీజు కోసం తెలుగుదేశం పార్టీ నేత లింగమనేని రమేష్ కూడా టెండర్ వేశారని, రమేష్ అత్యధికంగా కోట్ చేసిన బిడ్డర్లో రెండో స్థానంలో నిలిచారని, దాంతో అది గంటా శ్రీనివాస రావుకు చెందిన ప్రత్యూష కంపెనీకి దక్కిందని ఆయన అన్నారు. లింగమనేని రమేష్కు కాంట్రాక్టు లభించి ఉంటే తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడి ఉండేవారు కారని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రైవేటీకరణకు వ్యతిరేకమైతే భవానీ దీవిపై మాట్లాడాలని, అయితే వారు వ్యతిరేకం కాదని పలుసార్లు రుజువైందని అంటూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ప్రైవేట్పరం చేసిన ఉదంతాలను కన్నబాబు ఉదహరించారు.
Comments
English summary
MLA Kanna Babu retaliated TDP allegations against Chiranjeevi regarding Bhavani island issue.
Story first published: Thursday, February 16, 2012, 19:48 [IST]