హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వరకట్న చెల్లింపునకు దోపిడీకి దిగిన ఎంబిఎ అమ్మాయి

By Pratap
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: పెళ్లి దగ్గర పడుతున్న సమయంలో వరకట్నం చెల్లింపు కోసం ఓ అమ్మాయి దోపిడీకి దిగింది. ఆమె మామూలు అమ్మాయేం కాదు, ఎంబిఎ విద్యార్థిని. హైదరాబాదులోని కుషాయిగుడాలో శుక్రవారం తన తల్లితో కలిసి ఆ అమ్మాయి ఓ గృహిణి బంగారు గొలుసును దొంగిలించడానికి ప్రయత్నించింది.

తల్లి రమాదేవి, కూతురు శారద ఎపిఐఐసి కాలనీలోని కల్పన అనే గృహిణి ఇంట్లోకి చొరబడ్డారు. ముసుగులు కప్పుకున్న వారిద్దరు కల్పనను కింద పడేసి ఆమె గొలుసును ఎత్తుకుపోవడానికి ప్రయత్నించారు. కల్పన పెద్దగా అరవడంతో ఇరుగు పొరుగువారు వచ్చి ఆ ఇద్దరు మహిళలను పట్టుకున్నారు.

శారద కుషాయిగుడాలోని సాయి సుధీర్ కళాశాలలో ఎంబిఎ రెండో సంవత్సరం చదువుతోంది. పెళ్లి కుమారుడి కుటుంబానికి శారద కుటుంబ సభ్యులు లక్ష రూపాయల వరకట్నం ఇవ్వాల్సి ఉంది. మార్చి 8వ తేదీన పెళ్లి పెట్టుకున్నారు. కల్పన ఒంటరిగా ఉంటుందని తెలుసుకుని తల్లీకూతుళ్లు ఈ దోపిడీ యత్నానికి దిగారు. నిందితులు ఇంతకు ముందు కల్పన ఇంటి పక్కనే ఉండేవారు. ఇప్పుడు కమలాపురిలో ఉంటున్నారు.

English summary
In a desperate act to meet the dowry requirements ahead of her wedding, an MBA student along with her mother made a vain bid to rob a housewife of her gold chain at APIIC colony, Kushaiguda on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X