హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సిలిండర్ పేలి అగ్ని ప్రమాదం: ఏడుగురు మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Rangareddy District
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మండలం గండ్లపోచంపల్లి గ్రామంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. శనివారం జరిగిన అగ్నిప్రమాదంలో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. మరణించినవారిలో నలుగురు చిన్నారులు, ఓ మహిళ ఉన్నట్లు అనుమానిస్తున్నారు. దాదాపు 50 మంది గాయపడినట్లు తెలుస్తోంది. దాదాపు 100 గుడిసెలు దగ్ధమయ్యాయి.

గ్యాస్ సిలిండర్ పేలడంతో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ గుడిసెలోని సిలిండర్ పేలడంతో ప్రారంభమైన మంటలు ఇతర గుడిసెలకు వ్యాపించాయి. సంఘటనా స్థలానికి ఫైర్ ఇంజన్లు చేరుకుని మంటలను అదుపు చేశాయి. గాయపడినవారిని ఆస్పత్రులకు తరలించారు. మృతుల సంఖ్యపై ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితి హృదయవిదారకంగా ఉంది. కూలీ చేసుకునేవారే ఎక్కువగా ఇక్కడ నివాసం ఉంటున్నారు. తల్లిదండ్రులు పనులకు వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం చేసుకుంది. బాధితులు మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాలకు చెందిన కూలీలు అని తెలుస్తోంది.

ప్రమాదవశాత్తు మాత్రమే అగ్ని ప్రమాదం జరిగిందని పోలీసులు అంటున్నారు. గుడిసెలను ఖాళీ చేయించడానికి చేసిన ప్రయత్నంలో భాగంగానే నిప్పు పెట్టించారనే అనుమానాలు వ్యక్తమవుతున్న స్థితిలో పోలీసులు ఆ వివరణ ఇచ్చారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. హోం మంత్రి సబితా ఇంద్రా రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

English summary
Seven, including six children and woman were killed in afire accident in Rangareddy district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X