బెనజీర్ భుట్టో హత్య వెనక పర్వేజ్ ముషార్రఫ్?
బెనజీర్ హత్యపై జరిగిన విచారణ నివేదికను సింధు అసెంబ్లీ ప్రొవిన్షియల్కు సమర్పించినట్లు ఆ టీవీ చానెల్ తెలిపింది. బెనజీర్ హత్యకు అకోరా ఖట్టక్లో హఖానియా మదర్సాలోని ఓ గదిలో సెల్ను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. అయితే, హత్యకు వజీరిస్తాన్లో ప్లాట్ రూపుదిద్దుకున్నట్లు, ఆల్ ఖైదా ఆదేశాలను 2007 డిసెంబర్ 27వ తేదీన బైతుల్లా అమలు చేసినట్లు తెలిపింది.
టీవీ చానెల్ కథనం ప్రకారం - బెనజీర్ హత్యలో 16 మంది ఉగ్రవాదులు పాల్గొన్నారు. వీరిలో ఇద్దరు పోలీసులతో పాటు ఐదుగురిని అరెస్టు చేశారు. ఆరుగురు మరణించారు. అయితే, ఆ నివేదిక నిర్ధారణలను ముషార్రఫ్కు చెందిన ఆల్ పాకిస్తాన్ ముస్లిం లీగ్ తోసిపుచ్చింది. బెనజీర్ భుట్టోకి ముషార్రఫ్ తగిన భద్రత ఏర్పాటు చేయలేదని, దీంతో సమస్య తలెత్తిందని నివేదిక తెలిపింది. బెనజీర్ భుట్టో హత్యలో ఎవరెవరు ఏ విధంగా పాల్గొన్నదీ నివేదికలో వివరించారు. ఆ వివరాలను కూడా టీవీ చానెల్ ప్రసారం చేసింది.