తీరు మారని సభ: 3రోజుల సెలవు తర్వాతా వాయిదాలే
కాగా అసెంబ్లీ వాయిదా పడ్డ అనంతరం మీడియా పాయింట్ వద్ద టిఆర్ఎస్ నేతలు ఈటెల రాజేందర్ తదితరులు మాట్లాడారు. సకల జనుల సమ్మె సమయంలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నిలబెట్టుకోవాలని వారు డిమాండ్ చేశారు. అప్పటి వరకు సభను జరగనివ్వమని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలంగాణపై ఎన్నికలకు ముందు ఇచ్చిన మాటపై నిలబడాలన్నారు. లేదంటే తెలంగాణ ప్రజలు ఆ పార్టీకి బుద్ది చెబుతారని హెచ్చరించారు. విద్యార్థులపై కేసులు పెట్టడానికి కారణం మాట ఇచ్చి తప్పిన కాంగ్రెసు, టిడిపిలేనని అన్నారు. ప్రజాక్షేత్రంలో ఈ పార్టీలకు ప్రజలు పాతరేస్తారని వారు అన్నారు.
Comments
assembly nadendla manohar etela rajender telanana hyderabad అసెంబ్లీ నాదెండ్ల మనోహర్ ఈటెల రాజేందర్ తెలంగాణ హైదరాబాద్
English summary
Speaker Nadendla Manohar adjourned Assembly for half an hour today.
Story first published: Tuesday, February 21, 2012, 9:41 [IST]