హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సభ వాయిదా, స్పీకర్‌ను కలిసిన జగన్‌వర్గం శోభా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Assembly
హైదరాబాద్: విపక్షాల ఆందోళనల నడుమ స్పీకర్ నాదెండ్ల మనోహర్ శాసనసభను అరగంట పాటు వాయిదా వేశారు. బుధవారం తొమ్మిది గంటలకు శాసనసభ ప్రారంభమైంది. తెలుగుదేశం పార్టీ మద్యం సిండికేట్లపై, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణపై తీర్మానం కోసం పట్టుబట్టాయి. విపక్షాలు ఎంతకూ పట్టు వీడక పోవడంతో స్పీకర్ సభను అరగంట పాటు వాయిదా వేశారు. సభ వాయిదా పడిన అనంతరం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం శాసనసభ్యులు పిల్లి సుభాష్ చంద్ర బోసు, శోభా నాగి రెడ్డి స్పీకర్‌తో భేటీ అయ్యారు.

కాగా తెలుగుదేశం పార్టీ నేత దూళిపాళ్ల నరేంద్ర మీడియా పాయింట్ వద్ద ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. మద్యం సిండికేట్లలో అక్రమాలకు పాల్పడ్డ ఎక్సైజ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణను వెంటనే తొలగించాలని దూళిపాళ్ల డిమాండ్ చేశారు. అక్రమాలకు పాల్పడ్డ మోపిదేవిపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఏ చర్యలు తీసుకోలేదని విమర్శించారు. మంత్రులపై చర్యలకు ఎసిబి వెనుకాడుతోందన్నారు. మంత్రులపై విమర్శలు వస్తున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం వారిని వదిలేసి అధికారులను అరెస్టు చేస్తోందన్నారు.

English summary
Speaker Nadendla Manohar adjourned Assembly for half an hour.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X